FIH Pro League: భారత్‌, జర్మనీ మెన్స్‌ హాకీ మ్యాచ్‌లు వాయిదా 

8 Mar, 2022 20:49 IST|Sakshi

భువనేశ్వర్‌: పురుషుల ప్రో హాకీ లీగ్‌ 2022లో భాగంగా భారత్‌, జర్మనీ జట్ల మధ్య ఈ వారాంతం జరగాల్సిన డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు కోవిడ్‌ కారణంగా వాయిదా పడ్డాయి. విజిటర్స్‌ క్యాంప్‌లో కరోనా కేసులు నమోదు ​కావడంతో మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌)  గవర్నింగ్‌ బాడీ మంగళవారం వెల్లడించింది. భువనేశ్వర్‌ వేదికగా ఈ మ్యాచ్‌లు మార్చి 12, 13 తేదీల్లో జరగాల్సి ఉండింది. వాయిదాపడ్డ మ్యాచ్‌లను నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఎఫ్‌ఐహెచ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా, ప్రో హాకీ లీగ్‌ 2022లో భారత పురుషుల జట్టు ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ రెండు మ్యాచ్‌ల్లో టీమిండియానే విజయం సాధించింది. మరోవైపు ఇదే టోర్నీలో భారత మహిళల జట్టు ఈ వారాంతంలోనే జర్మనీతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందు కోసం ఇరు జట్లు ఇదివరకే భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంకు చేరుకున్నాయి. 
చదవండి: PAK Vs AUS: రెండో ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టిన పాక్‌ ఓపెనర్‌

మరిన్ని వార్తలు