ఐటీఎఫ్‌ టోర్నీ సింగిల్స్‌ చాంపియన్‌ సహజ

7 Mar, 2022 05:21 IST|Sakshi

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి సహజ యామలపల్లి విజేతగా అవతరించింది. నాగ్‌పూర్‌లో ఆదివారం జరిగిన సింగిల్స్‌ ఫైనల్లో సహజ 6–5తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి, మూడో సీడ్‌ ఎమిలీ సీబోల్డ్‌ (జర్మనీ) గాయం కారణంగా వైదొలిగింది. దాంతో సహజను విజేతగా ప్రకటించారు. సహజ కెరీర్‌లో ఇదే తొలి ఐటీఎఫ్‌ సింగిల్స్‌ టైటిల్‌ కావడం విశేషం.  

>
మరిన్ని వార్తలు