ITF Tournament: ఫైనల్లో విష్ణువర్ధన్‌ జంట 

19 Mar, 2022 07:45 IST|Sakshi

బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) పురుషుల టోర్నీలో భారత డేవిస్‌కప్‌ జట్టు మాజీ సభ్యుడు, హైదరాబాద్‌ ప్లేయర్‌ విష్ణువర్ధన్‌ డబుల్స్‌ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన డబుల్స్‌ సెమీఫైనల్లో రెండో సీడ్‌ విష్ణువర్ధన్‌–శశికుమార్‌ ముకుంద్‌ (భారత్‌) జంట 6–3, 2–6, 10–8తో మూడో సీడ్‌ సాకేత్‌ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్‌) ద్వయంపై గెలుపొందింది. 

మరిన్ని వార్తలు