యూఏఈలోనే టి20 ప్రపంచకప్‌: గంగూలీ

29 Jun, 2021 05:54 IST|Sakshi

కరోనా నేపథ్యంలో టి20 ప్రపంచకప్‌ వేదిక మారింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌లలో భారత్‌లో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్‌ను యూఏఈకి తరలిస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశారు. ఆటగాళ్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.  ‘ప్రపంచకప్‌ వేదికను యూఏఈకి మారుస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)కి సమాచారం ఇచ్చాం. తుది షెడ్యూల్, ఇతరత్రా విషయాలన్నీ త్వరలోనే వెల్లడిస్తాం’ అని గంగూలీ చెప్పారు.

మరిన్ని వార్తలు