టీ-20 వరల్డ్ కప్‌: అక్టోబర్ 24న భారత్, పాక్ మ్యాచ్‌

4 Aug, 2021 14:02 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ పాక్‌ మధ్య మ్యాచ్‌ అంటే ఆ మాజాయే వేరు. ఈ ఏడాది జరగనున్న టీ-20 ప్రపంచ కప్‌ ద్వారా క్రికెట్‌ ప్రేమికులు దాన్ని ఆస్వాదించనున్నారు. ప్రపంచకప్‌ కోసం ఐసీసీ విడుదల చేసిన జాబితాలో పాకిస్తాన్‌, భారత్‌ గ్రూప్‌-2 నుంచి పొట్టి ప్రపంచ కప్‌ సమరానికి పోటీలో పాల్గొంటున్నాయి.  చిరకాల ప్రత్యర్థులైన రెండు జట్లు ఈ ఏడాది దుబాయ్‌ వేదికగా అక్టోబర్ 24న జరగనున్న మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇక అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు టీ-20 ప్రపంచకప్‌ జరుగుతుందన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు