ICC Women's ODI Rankings: రెండో ర్యాంక్‌కు చేరుకున్న మిథాలీ 

2 Feb, 2022 08:13 IST|Sakshi

ICC Women ODI Rankings: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి విడుదల చేసిన మహిళా బ్యాటర్స్‌ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ మూడో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియన్‌ బ్యాటర్‌ అలీసా హీలీ (750 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా.. మిథాలీ 738 పాయింట్లతో ఆమె తర్వాతి స్థానం ఆక్రమించింది. 

ఇక భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ ఐదు నుంచి నాలుగో స్థానానికి చేరింది. స్మృతి మంధాన ఆరో ర్యాంకులో మార్పులేదు. బౌలింగ్‌ విభాగంలో జులన్‌ గోస్వామి రెండో ర్యాంక్‌లో... ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ నాలుగో ర్యాంక్‌లో కొనసాగుతోంది. 

చదవండి: Icc U 19 World Cup 2022: మరో ఫైనల్‌ వేటలో.. అండర్‌-19 టీమిండియా
IPL 2022 Auction: వేలంలో మనవాళ్లు 23 మంది.. అంబటి, హనుమ విహారి, తన్మయ్‌, మనీశ్ రెడ్డి.. ఇంకా..

మరిన్ని వార్తలు