IND vs LEI: రాణించిన శుబ్‌మన్‌ గిల్‌.. 'డ్రా' గా ముగిసిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌..!

27 Jun, 2022 07:29 IST|Sakshi

లెస్టర్‌షైర్‌ జట్టుతో జరిగిన నాలుగు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను భారత జట్టు ‘డ్రా’ గా ముగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 364/7 వద్దే భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి లెస్టర్‌షైర్‌కు 367 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లెస్టర్‌షైర్‌ 66 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. లెస్టర్‌ జట్టుకు ఆడిన భారత  ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ (62; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. స్పిన్నర్‌ అశ్విన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.
చదవండి: India vs Ireland 1st T20I: ఐర్లాండ్‌కు చుక్కలు చూపించిన భారత్‌.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం

మరిన్ని వార్తలు