India Vs New Zealand 3rd T20:న్యూజిలాండ్తో కీలక పోరుకు టీమిండియా సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా సిరీస్ డిసైడర్ మూడో టీ20లో బుధవారం కివీస్తో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు సోమవారం అహ్మదాబాద్కు చేరుకుంది. ఈ సందర్భంగా టీమిండియాకు సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం లభించింది.
ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. "భారత్, న్యూజిలాండ్ ఆఖరి టీ20 కోసం అహ్మదాబాద్ చేరుకున్నాం" అని ఈ వీడియోకు బీసీసీఐ క్యాప్షన్ ఇచ్చింది. ఇక అహ్మదాబాద్కు చేరుకున్న భారత జట్టు మంగళవారం తమ ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది.
ఇదిలా ఉంటే.. కీలకమైన మూడో టీ20లో భారత పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన గిల్ స్థానంలో పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా పేసర్ ముఖేష్ కుమార్కు కూడా ఆఖరి టీ20కు భారత తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.
భారత తుది జట్టు(అంచనా): ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్
చదవండి: IND vs NZ: బ్యాటర్లకు చుక్కలు చూపించిన లక్నో పిచ్.. క్యూరేటర్పై వేటు!
Hello Ahmedabad 👋
We are here for the third & final T20I of the #INDvNZ series 👏 👏#TeamIndia pic.twitter.com/gQ1jPEnPvK
— BCCI (@BCCI) January 30, 2023