IND vs SL: ఏంటి అర్ష్‌దీప్‌ బౌలింగ్‌ మర్చిపోయావా? ఒకే ఓవర్‌లో మూడు నో బాల్స్‌

5 Jan, 2023 19:55 IST|Sakshi

యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ దాదాపు రెండు నెలల తర్వాత భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ తర్వాత సెలక్టర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌ విశ్రాంతి ఇచ్చారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన అర్ష్‌దీప్‌.. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు తిరిగి జట్టులోకి వచ్చాడు.

అయితే అనారోగ్యం కారణంగా తొలి టీ20కు దూరమైన అర్ష్‌దీప్‌.. రెండో టీ20కు కోలుకున్నాడు. దీంతో జట్టులోకి వచ్చిన అర్ష్‌దీప్‌ సింగ్‌ తనదైన మార్క్‌ చూపించడంలో విఫలమయ్యాడు. శ్రీలంక ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేయడానికి వచ్చిన అర్ష్‌దీప్‌ తన తొలి ఓవర్‌లోనే ఏకంగా 19 పరుగులు సమర్పించుకున్నాడు.

ఈ విషయం పక్కన పెడితే.. అర్ష్‌దీప్‌  అదే ఓవర్‌లో వరుసగా మూడు నో బాల్స్‌ వేశాడు. దీంతో తన ఓవర్‌లో ఏకంగా 9 బంతులు అర్ష్‌దీప్‌ వేశాడు. ఆఖరి బంతిని పూర్తి చేయడానికి అర్ష్‌దీప్‌ ఏకంగా 14 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో నెటిజన్లు అర్ష్‌దీప్‌ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఏంటి అర్ష్‌దీప్‌ బౌలింగ్‌ మర్చిపోయవా అంటూ ట్విట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు