Icc women's world cup 2022: వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం.. అదరగొట్టిన మంధాన

2 Mar, 2022 08:17 IST|Sakshi

రంగియోరా (న్యూజిలాండ్‌): వన్డే ప్రపంచకప్‌ సన్నాహాల్లో భాగంగా మంగళవారం జరిగిన రెండో ప్రాక్టీస్‌ పోరులో భారత జట్టు 81 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై నెగ్గింది. ఓపెనర్‌ స్మృతి మంధాన (67 బంతుల్లో 66; 7 ఫోర్లు), దీప్తి శర్మ (64 బంతుల్లో 51; 1 ఫోర్‌) అర్ధ సెంచరీలు చేశారు. యస్తిక భాటియా (42; 5 ఫోర్లు), కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (30; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. దీంతో మొదట భారత్‌ 50 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. తర్వాత విండీస్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులే చేయగలిగింది.    

మరిన్ని వార్తలు