Ind Clash With Pak: భారత అభిమానుల కోరిక నెరవేరే ఛాన్స్‌! మరోసారి పాక్‌తో మ్యాచ్‌.. ఎప్పుడంటే?

18 Nov, 2021 19:18 IST|Sakshi

India Clash With Pakistan In 2022, Check Complete Details: దాయాదుల పోరు అంటే క్రికెట్‌ ఆభిమానులకు పెద్ద పండగే. ఇరు జట్లు మధ్య పోరు కోసం భారత అభిమానులు ఎంతో  ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే టీ20 ప్రపంచకప్‌-2021లో పాకిస్తాన్‌ చేతిలో ఓడిపోయి టీమిండియా ఘోర పరాభవం పొందింది. దీంతో పాక్‌పైన భారత్‌ ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. అయితే భారత్‌-పాక్‌ దేశాల నెలకొన్న ఉద్రిక్తల మధ్య ఇప్పటిలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగే అవకాశం లేదు. దీంతో క్రికెట్‌ అభిమానులు  ఐసీసీ ఈవెంట్‌లు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. 

ఈ క్రమంలో క్రికెట్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌..  వచ్చే ఏడాది జరగనున్న ఆసియా కప్‌లో భారత్‌- పాకిస్తాన్‌లు మరో సారి తలపడనున్నాయి.  దీనికి  శ్రీలంక వేదిక కానుంది. 2020లో జరగాల్సిన ఆసియాకప్‌ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ క్రమంలో 2022లో ఆసియా కప్‌కు శ్రీలంక అతిథ్యం ఇవ్వబోతుంది. ఈ టోర్నమెంట్‌ వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆసియా కప్‌ ఈసారి టీ20 ఫార్మట్‌లో జరగనుంది. అదే విధంగా 2022లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లోను ఇరు దేశాలు తలపడే అవకాశం ఉంది. మొత్తంమీద వచ్చే ఏడాది  భారత ఆభిమానులకు పండగే అనే చెప్పాలి. 
చదవండిT20 WC 2021: ఫైనల్‌కు ముందు రాత్రంతా.. గాయంతో బాధపడినా గానీ..

మరిన్ని వార్తలు