Chess Olympiad 2022: పతకం రేసులో భారత్‌ ‘ఎ’ 

9 Aug, 2022 08:22 IST|Sakshi

చెన్నై: చెస్‌ ఒలింపియాడ్‌ మహిళల విభాగంలో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్‌దేవ్, భక్తి కులకర్ణిలతో కూడిన భారత ‘ఎ’ జట్టు పతకం రేసులో నిలిచింది. పదో రౌండ్‌ తర్వాత భారత్‌ ‘ఎ’ 17 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. పదో రౌండ్‌లో భారత్‌ ‘ఎ’ 3.5–0.5తో కజకిస్తాన్‌పై నెగ్గింది. ఓపెన్‌ విభాగంలో భారత్‌ ‘ఎ’ మూడో స్థానంలో... భారత్‌ ‘బి’ నాలుగో స్థానంలో ఉన్నాయి. నేడు చివరిదైన 11వ రౌండ్‌ జరుగుతుంది.  

మరిన్ని వార్తలు