17 కోట్ల 70 లక్షల మంది చూశారు

29 Jul, 2021 06:54 IST|Sakshi

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో భాగంగా గత నెలలో భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ను కోట్ల మంది తిలకించారు. జూన్‌లో జరిగిన ఫైనల్‌ను ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్ల 70 లక్షల మంది టీవీల్లో వీక్షించినట్లు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించింది. డబ్ల్యూటీసీలో జరిగిన అన్ని సిరీస్‌ల్లో కంటే ఫైనల్‌ పోరునే ఎక్కువ మంది చూసినట్లు ఐసీసీ ప్రకటించింది. ఇందులో సింహభాగం భారత ప్రేక్షకులే ఉన్నట్లు ఐసీసీ తెలిపింది.

మరిన్ని వార్తలు