County Cricket 2022: చతేశ్వర్‌ పుజారా అజేయ డబుల్‌ సెంచరీ

18 Apr, 2022 06:09 IST|Sakshi

ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో భాగంగా సస్సెక్స్‌ జట్టు తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే భారత ప్లేయర్‌ చతేశ్వర్‌ పుజారా అదరగొట్టాడు. డెర్బీషైర్‌తో ‘డ్రా’గా ముగిసిన ఈ మ్యాచ్‌లో పుజారా (201 నాటౌట్‌; 23 ఫోర్లు), టామ్‌ హైన్స్‌ (243; 22 ఫోర్లు) డబుల్‌ సెంచరీలు సాధించారు. దాంతో ఫాలోఆన్‌ ఆడుతూ ఓవర్‌నైట్‌ స్కోరు 278/2తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన సస్సెక్స్‌ జట్టు 176.1 ఓవర్లలో 3 వికెట్లకు 513 పరుగులు చేసి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది.

మరిన్ని వార్తలు