IND-A vs NZ-A: మూడు వికెట్లతో చేలరేగిన ముకేశ్‌ కుమార్‌.. న్యూజిలాండ్‌ స్కోర్‌: 156/5

2 Sep, 2022 08:07 IST|Sakshi
Photo Credit: The Hindu

బెంగళూరు: భారత్‌ ‘ఎ’తో గురువారం ప్రారంభమైన తొలి అనధికారిక టెస్టులో న్యూజిలాండ్‌ ‘ఎ’ తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. జో కార్టర్‌ (73 బ్యాటింగ్‌) అర్ధ సెంచరీ సాధించాడు.

భారత్‌ ‘ఎ’ బౌలర్లలో పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ 34 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా...యశ్‌ దయాళ్, అర్జాన్‌ చెరో వికెట్‌ తీశారు. ప్రతికూల వాతావరణం కారణంగా మొదటి రోజు 61 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. 
చదవండి: శ్రీలంక సంచలన విజయం

మరిన్ని వార్తలు