లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో టాప్‌–10పైనే దృష్టి

26 Jul, 2020 06:38 IST|Sakshi

కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు వ్యాఖ్య

న్యూఢిల్లీ: లాస్‌ ఏంజెలిస్‌ –2028 ఒలింపిక్స్‌ నాటికి పతకాల జాబితాలో తొలి 10 స్థానాల్లో నిలిచేలా భారత్‌ గట్టి పోటీనిస్తుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకే ‘టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం జూనియర్‌ స్కీమ్‌’ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 10–13 వయస్సున్న చురుకైన క్రీడాకారులను ఎంపిక చేసి 2028నాటికి ఒలింపియన్లుగా తయారుచేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోచ్‌లతో వారికి శిక్షణ అందిస్తామని చెప్పారు. ఈ మేరకు సుశిక్షితులైన స్వదేశీ కోచ్‌ల పదవీకాలాన్ని పొడిగించామని పేర్కొన్నారు. భారత్‌ను క్రీడాశక్తిగా చూడాలనుకున్న ప్రతీ ఒక్కరి ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

>
మరిన్ని వార్తలు