ఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్కప్లో భారత షూటర్ల జోరు కొనసాగుతుంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో అన్ని పతకాలు భారతీయ మహిళా షూటర్లు కైవసం చేసుకోవడం విశేషం. బుధవారం జరిగిన 25 మీటర్ల పిస్టల్ విభాగంలో చింకీ యాదవ్కు స్వర్ణం, రాహీ సావంత్కు రజతం, మను బాకర్కు కాంస్యం దక్కించుకున్నారు.