టీ20 మహిళా జట్టు హర్మన్ప్రీత్ కౌర్కు కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: భారత మహిళల జట్టు టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కరోనా బారిన పడ్డారు. జ్వరం రావడంతో సోమవారం పరీక్ష చేయించుకోగా కోవిడ్-19 పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. దీంతో హర్మన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె బాగానే ఉన్నారని, త్వరలోనే కోలుకుంటారని పేర్కొన్నాయి. కాగా ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో హర్మన్ ప్రీత్ కౌర్ ఆడారు. ఐదు వన్డేల్లో కలిపి మొత్తంగా 160 పరుగులు చేశారు.
కాగా ఈ సిరీస్ను భారత్ 1-4 తేడాతో కోల్పోయింది. ఇక ఐదో వన్డేలో గాయపడిన హర్మన్ప్రీత్, సౌతాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్కు దూరమయ్యారు. కాగా టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్కు కూడా కరోనా సోకిన విషయం విదితమే. అదే విధంగా పఠాన్ సోదరులు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ సైతం తమకు కోవిడ్ పాజిటివ్గా నిర్దారణ అయినట్లు ప్రకటించారు.