World Shooting Championship: భారత జట్టుకు కాంస్యం 

18 Oct, 2022 07:17 IST|Sakshi

కైరో (ఈజిప్ట్‌): ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు లభించాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఇలవేనిల్, మెహులీ ఘోష్, మేఘన సజ్జనార్‌లతో కూడిన భారత జట్టు కాంస్యం సాధించింది. కాంస్య పతక మ్యాచ్‌లో భారత్‌ 17–11తో జర్మనీపై గెలిచింది. జూనియర్‌ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ విభాగంలో సమీర్‌ రజతం గెలిచాడు. ఫైనల్లో సమీర్‌ 23–25తో వాంగ్‌ షివెన్‌ (చైనా) చేతిలో ఓడిపోయాడు.    

మరిన్ని వార్తలు