Shikhar Dhawan: రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డు అందుకున్న శిఖర్ ధావన్.. వీడియో వైరల్‌

13 Nov, 2021 18:08 IST|Sakshi

Shikhar Dhawan Honoured With Arjuna Award, Video:  జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం రాష్టపతి భవన్‌లో ఆట్టహాసంగా జరిగింది. 2021లో మొత్తం 62 మందికి ఈ అవార్డులను  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్  ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భారత క్రికెటర్ శిఖర్ ధావన్ రాష్ట్రపతి చేతుల మీదగా అర్జున అవార్డు అందుకున్నాడు.

అధేవిధంగా భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్నఅవార్డులను  .. టోక్యో ఒలింపిక్‌ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, భారత స్టార్‌ క్రికెటర్‌  మిథాలీ రాజ్‌తో పాటు పలువురు క్రీడాకారులకు ప్రదానం చేశారు.  ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం క్రీడలలో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది. గణతంత్ర్య దినోత్సవం సందర్బంగా జనవరి 26న ఈ అవార్డులను ప్రకటిస్తారు. 

చదవండి: రిజ్వాన్‌ కోలుకోవడం‍లో భారత డాక్టర్‌ కీలక పాత్ర... కృతజ్ఞతగా ఏమి ఇచ్చాడంటే..

మరిన్ని వార్తలు