ప్రపంచ ఆరో ర్యాంకర్‌పై సత్యన్‌ విజయం 

18 Jun, 2022 10:37 IST|Sakshi

వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ కంటెండర్‌ టోర్నీలో భారత నంబర్‌వన్‌ సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ సంచలనం సృష్టించాడు. క్రొయేషియాలో జరుగుతున్న ఈ టోర్నీలో సత్యన్‌ తొలి రౌండ్‌లో 6–11, 12–10, 11–9, 12–10తో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ జార్జిక్‌ డార్కో (స్లొవేనియా)ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. టాప్‌–10 ర్యాంకింగ్స్‌ లోని క్రీడాకారుడిని ఓడించడం సత్యన్‌ కెరీర్‌లో ఇది రెండోసారి.     

మరిన్ని వార్తలు