Kohli- Dhoni: ఏంటి కోహ్లి..మ్యాచ్‌ ముగిసిన తర్వాత కూడా వదలవా!

25 Sep, 2021 14:49 IST|Sakshi
Courtesy: IPL Twitter

Virat Kohli Hugs MS Dhoni.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా శుక్రవారం ఆర్‌సీబీ, సీఎస్‌కే మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు షార్జా స్టేడియంలో ఇసుక తుఫాను రావడంతో టాస్‌ కొంత ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కోహ్లి, ధోనిలు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. తాజాగా మ్యాచ్‌ ముగిసిన అనంతరం కూడా కోహ్లి, ధోని అదే కంటిన్యూ చేయడం విశేషం. సీఎస్‌కే విజయం సాధించిన తర్వాత విషెస్‌ చెప్పే సమయంలో కోహ్లి ధోనిని వెనుక నుంచి హగ్‌ చేసుకోవడం.. ఆ తర్వాత ఇద్దరు చాలా చర్చించుకోవడం జరిగింది.

చదవండి: Dhoni-Kohli Chit Chat: టాస్‌కు ముందు కోహ్లి, ధోని ఏం మాట్లాడుకున్నారు?


Courtesy: IPL Twitter

ఇది చూసిన అభిమానులు ఊరుకుంటారా.. పబ్లిక్‌గానే వాళ్లిద్దరి బ్రొమాన్స్‌ చూడండి అంటూ ఫన్నీ ట్వీట్లతో రెచ్చిపోయారు. '' ఇద్దరు లెజెండ్స్‌ ఎక్కడ కలిసిన.. ఏం మాట్లాడినా అది చర్చే అవుతుంది. ధోని టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా టీమిండియాకు మెంటార్‌గా ఎంపికయ్యాడు.. అది తెలిసినప్పటి నుంచి కోహ్లి సంతోషంలో మునిగిపోయాడు. పాపం అందుకే మ్యాచ్‌ ముగిసిన తర్వాత కూడా ధోనిని వదల్లేకపోతున్నాడు.'' అంటూ కామెంట్స్‌ చేశారు. 


Courtesy: IPL Twitter
ఇక మ్యాచ్‌లో సీఎస్‌కే ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. సీఎస్‌కే ఓపెనర్లు డుప్లెసిస్‌, రుతురాజ్‌ మంచి ఆరంభాన్ని ఇవ్వగా.. మొయిన్‌ అలీ, అంబటి రాయుడులు ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఆఖర్లో ధోని, రైనాలు కలిసి ఫినిషింగ్‌ టచ్‌ ఇస్తూ జట్టుకు విజయాన్ని అందించారు. 

చదవండి: MS Dhoni: బ్రావో ఇలా చేశాడే అనుకుంటారు కదా.. ఆ విషయంలోనే మాకు ‘గొడవలు’!

>
మరిన్ని వార్తలు