IPL 2021: ఇద్దరు చిన్నారులకు బాల్‌ గిప్ట్‌గా ఇచ్చిన ధోని.. వీడియో వైరల్‌

11 Oct, 2021 14:07 IST|Sakshi
Courtesy: IPL

Ms Dhoni Gifts The Match ball to Two Young Fans: మహేంద్ర సింగ్‌ ధోని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దుబాయ్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 2021 తొలి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌ అనంతరం ధోనీ మ్యాచ్ బాల్‌పై సంతకం చేశాడు. అయితే ఆ  బంతిని  స్టాండ్స్‌లో ఉన్న ఇద్దరు చిన్నారులకు ధోని గిప్ట్‌గా ఇచ్చాడు. దీంతో ఆ చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో ధోని 6 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 18 పరుగులు చేసి జట్టును తొమ్మిదోసారి ఫైనల్‌కు చేర్చాడు.

చదవండి: Virat Kohli: సీట్లోంచి లేచి ఎగిరి గంతేశాను.. గ్రేటెస్ట్‌ ఫినిషర్‌.. ధోనిపై ప్రశంసల జల్లు

మరిన్ని వార్తలు