మంచి టెక్‌ ఇంజనీర్‌ను పెట్టుకోండి: ఆర్సీబీ చురకలు

3 Apr, 2021 20:44 IST|Sakshi

ముంబై: ఐపీఎల్- 2021 సీజన్ సందడి మొదలైంది.  మరో ఆరు రోజుల్లో ఐపీఎల్‌ తాజా సీజన్‌ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ట్విటర్ ఇండియా తమ యూజర్లను మరింత ఆకట్టుకునేందుకు ఫ్రాంచైజీల ఎమోజీలను విడుదల చేసింది. అయితే ఈ ఎమోజీల విషయంలో ట్వీటర్ ఇండియా ఘోర తప్పిదం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) జెర్సీని రాయల్ చాలెంజర్స్  బెంగళూరు(ఆర్‌సీబీ) ఎమోజీగా పేర్కొంది. 

అయితే దీన్ని తీవ్ర అవమానంగా భావించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ట్విటర్ ఇండియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు మంచి టెక్ ఇంజనీర్‌ను నియమించుకోవాలని, ఉద్యోగ నియమకాలను చేపట్టడానికి బెంగళూరు సరైన ప్రదేశమని చురుకలంటించింది. 'హే ట్విటర్, ట్విటర్ ఇండియా.. మీరు వెంటనే ఓ మంచి టెక్ ఇంజనీర్‌ను నియమించుకోండి. నియమకాలు చేపట్టడానికి బెంగళూరు అనువైన ప్రదేశం. ఇక్కడే మొదలుపెట్టండి’ అని ట్వీట్‌ చేసింది.

అభిమానులు సైతం ట్విటర్ ఇండియాను ట్రోల్ చేశారు. అలాగే ఆర్‌సీబీ టీమ్‌పైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆర్‌‌సీబీపై తమదైన శైలిలో సెటైర్ వేసింది. సౌతిండియా సూపర్ స్టార్ ఆల్‌టైమ్ ఫేవరేట్ మూవీ 'నరసింహా'లోని ఓసీన్‌కు సంబంధించిన మీమ్‌ను షేర్ చేసింది. ఈ సీన్‌లో ఎర్ర చీర కట్టుకున్న దివంగత హీరోయిన సౌందర్యపై రజనీకాంత్ పసుపు నీళ్లు పోసే ఫోటోను పోస్ట్‌ చేసింది. ఇక రాజస్తాన్‌ రాయల్స్‌ పెళ్లి కొడుక్కి పసుపు పూసే మీమ్‌ను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఇవన్నీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఇక్కడ చదవండి: హైదరాబాద్‌ను వద్దనుకున్నారు.. ఇప్పుడు తప్పదేమో!

ఐపీఎల్‌ చరిత్రలో ఈ వికెట్‌ కీపర్లు ప్రత్యేకం

మరిన్ని వార్తలు