పంత్‌లో నాకు ఆ ఇద్దరు కనిపిస్తున్నారు: పాంటింగ్‌

14 Apr, 2021 20:27 IST|Sakshi
Photo Courtesy: IPL

ముంబై: ఐపీఎల్‌ 14వ సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘనంగా ఆరంభించిన సంగతి తెలిసిందే. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 189 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఆ జట్టు ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడడంతో సునాయస విజయాన్ని దక్కించుకుంది. తొలి మ్యాచ్‌ విజయంతో ఉత్సాహంగా కనిపిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ రేపు రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కోచ్‌ రికీ పాంటింగ్‌ రిషబ్‌ పంత్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

''నాకు రిషబ్‌ పంత్‌లో కోహ్లి, విలియమ్సన్‌లు కనిపిస్తున్నారని.. అతని దూకుడులో కోహ్లి కనిపిస్తుంటే.. కెప్టెన్సీలో విలియమ్సన్‌ను గుర్తుకు తెస్తున్నాడు. ఈ ఐపీఎల్‌లో పంత్‌ ఏ స్థానంలో బ్యాటింగ్‌ రావాలనేదానిపై మాకు క్లారిటీ లేదు. ​కానీ అతనికి నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్‌ బాగా అచ్చొచ్చంది. అయితే ఒక విషయంలో మాత్రం అతను మరింత రాటు దేలాల్సి ఉంది. జట్టులోకి కీపర్‌గా వచ్చిన రిషబ్‌ పంత్‌ కొన్నిసార్లు కీపింగ్‌లో​ అనవసర తప్పులు చేస్తున్నాడు. బ్యాటింగ్‌ పరంగా చూసుకుంటే మంచి టచ్‌లో ఉన్న అతనికి బ్రిలియంట్‌ ఫుట్‌వర్క్‌ ఉండడం అతనికి కలిసొచ్చే అంశం. ఎలాగు బ్యాటింగ్‌లో దూకుడు ప్రదర్శించే పంత్‌ కీపింగ్‌లోనూ మెరుగుపడితే ఇంకో 10-12 ఏళ్లు టీమిండియా తరపున లీడింగ్‌ వికెట్‌ కీపర్‌గా కొనసాగుతాడు.''అంటూ చెప్పుకొచ్చాడు. కాగా భుజం గాయంతో ఐపీఎల్‌ సీజన్‌కు దూరమైన శ్రేయాస్‌ అయ్యర్‌ స్థానంలో పంత్‌ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.

చదవండి: పంత్‌ సేనకు భారీ షాక్‌.. స్టార్‌ పేసర్‌కు కరోనా

చదవండి: 'పంత్‌ కూల్‌గా ఉండడం మాకు కలిసొచ్చింది'

మరిన్ని వార్తలు