అంపైర్‌ వార్నింగ్‌.. దెబ్బకి బౌలింగ్‌ మార్చేశాడు!

13 Apr, 2021 10:23 IST|Sakshi

ముంబై: మనం ఇటీవల కాలంలో రౌండ్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ను తరుచు చూస్తున్నాం. బ్యాట్స్‌మన్‌ను కన్‌ఫ్యూజ్‌ చేయడం కోసం ఈ తరహా బౌలింగ్‌ను ఎక్కువగా చేస్తున్నారు. రవిచంద్రన్‌ అశ్విన్‌, కేదార్‌ జాదవ్‌లు కూడా ఈ తరహా బౌలింగ్‌ వేసిన జాబితాలో ఉన్న ప్రముఖ క్రికెటర్లు.. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రౌండ్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ వేసి విమర్శలు పాలయ్యాడు. టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌.. అశ్విన్‌ బౌలింగ్‌ను  తప్పుబట్టాడు.  ఆఫ్‌ స్పిన్‌ను వదిలేసి ఈ బౌలింగ్‌ వేస్తున్నావేంటి బాబూ అని విమర్శించాడు. తాజాగా రాజస్తాన్‌ రాయల్స్‌ స్పిన్నర్‌ రియాన్‌ పరాగ్‌ కూడా ఈ తరహా బౌలింగ్‌ వేయబోయాడు. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో భాగంగా గేల్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు రౌండ్‌ ఆర్మ్‌ బౌలింగ్‌కు యత్నించాడు పరాగ్‌. 

10 ఓవర్‌ మూడో బంతిని రౌండ్‌ ఆర్మ్‌ బంతిగా వేశాడు. ఆ క్రమంలో అతని మోచేతి గ్రౌండ్‌కు దాదాపు సమాంతరంగా ఉండటంతో అంపైర్‌ రంగంలోకి దిగాడు.  ఆ బంతిని ఉద్దేశిస్తూ.. జాగ్రత్త.. అంతలా రౌండ్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ వేస్తే నిబంధనలకు విరుద్ధమయ్యే అవకాశం ఉందని వార్నింగ్‌ ఇచ్చాడు. దాంతో వెంటనే పరాగ్‌ బౌలింగ్‌ యాక్షన్‌ మార్చేశాడు. తన మునపటి స్టైల్‌ బౌలింగ్‌ వేశాడు. అయినప్పటికీ క్రిస్‌ గేల్‌ వికెట్‌ను సాధించాడు,. ఆ ఓవర్‌ ఐదో బంతిని గేల్‌ భారీ షాట్‌ ఆడగా బెన్‌ స్టోక్స్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు.  లాంగాన్‌ వైపు భారీగా కొట్టిన ఆ షాట్‌ను స్టోక్స్‌ జారవిడచకుండా పట్టుకోవడంతో గేల్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. దాంతో 40 పరుగుల వ్యక్తి గత స్కోరు డేంజర్‌ మ్యాన్‌ గేల్‌ పెవిలియన్‌ చేరాడు. 

మరిన్ని వార్తలు