జట్టు ఫిజియో ప్యాట్రిక్ ఫర్హాట్ కోవిడ్ బారిన పడటంతో బిక్కుబిక్కుమంటూ హోటల్ రూమ్స్కే పరిమితమైన ఢిల్లీ క్యాపిటల్స్ సభ్యులకు ఊరట కలిగించే వార్త తెలిసింది. ఫర్హాట్కు సన్నిహితంగా ఉన్నవారితో పాటు డీసీ బృంద సభ్యులందరికీ నిన్న (శుక్రవారం) జరిపిన కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఫర్హాట్ నుంచి మహమ్మారి ఎవరికీ వ్యాపించలేదని, ప్రస్తుతానికి ఆటగాళ్లందరూ సేఫ్గానే ఉన్నారని, వారికి శనివారం మరోసారి కోవిడ్ టెస్ట్లు చేయించామని, అందులోనూ అందరికీ నెగిటివ్గా తేలిందని డీసీ బృందంలోని కీలక వ్యక్తి జాతీయ మీడియాకు వెల్లడించాడు.
Your #DCvRCB Gameday Programme is here 🗞️
An epic clash awaits us, and it's time to build up to it with some all important numbers and nuggets 🔢#YehHaiNayiDilli | #IPL2022#TATAIPL | #IPL | #DelhiCapitals pic.twitter.com/vYKuuuh1DU
— Delhi Capitals (@DelhiCapitals) April 16, 2022
ఇదిలా ఉంటే, వాంఖడే వేదికగా ఢిల్లీ, ఆర్సీబీ జట్లు ఇవాళ రాత్రి 7:30 గంటలకు తలపడనున్న విషయం తెలిసిందే. ప్రస్తుత సీజన్లో డీసీ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో రెండింటిలో గెలుపొంది, మరో రెండిటిలో ఓటమిపాలైంది. ప్రస్తుతానికి ఆ జట్టు 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 3 విజయాలు 2 అపజయాలతో ఢిల్లీ కంటే ఓ ప్లేస్ ముందుంది. ఆర్సీబీ 6 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతుంది.
చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్కు గుడ్ న్యూస్.. రంగంలోకి దిగిన స్టార్ ఆల్రౌండర్