‘గతంలోనూ చాలా మందికి ఇలా జరిగింది’

26 Apr, 2022 05:10 IST|Sakshi

ఐపీఎల్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంలో విఫలమయ్యామని, అయితే ఇలాంటి వైఫల్యాలు ఎవరికైనా సహజమని ముంబై ఇండియన్స్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వ్యాఖ్యానించాడు. ఎందరో దిగ్గజాలకు ఇలాంటి స్థితి ఎదురైందని, ఆ దశను అధిగమించి వారు ముందుకు సాగారని రోహిత్‌ గుర్తు చేశాడు. ఏం జరిగినా ఈ జట్టుపై తన అభిమానం తగ్గదని చెప్పిన రోహిత్‌... కష్టకాలంలో తమకు మద్దతుగా నిలిచిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఐదు సార్లు లీగ్‌ చాంపియన్‌గా నిలిచిన ముంబై ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ ఓడింది.

మరిన్ని వార్తలు