ముంబై ఇండియన్స్‌ జట్టులో ధవళ్‌ కులకర్ణి

30 Apr, 2022 05:38 IST|Sakshi

ఐదుసార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శనతో ఆడిన 8 మ్యాచ్‌లు ఓడి ప్లేఆఫ్స్‌కు దూరమైంది. అయితే మిగిలున్న మ్యాచ్‌ల కోసం 33 ఏళ్ల పేస్‌ బౌలర్‌ ధవళ్‌ కులకర్ణిని తీసుకుంది. ఈ సీజన్‌లో ముంబై పేస్‌ దళం తీవ్రంగా నిరుత్సాహపరిచింది. ప్రధాన సీమర్‌ బుమ్రా (8 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు)సహా, జైదేవ్‌ ఉనాద్కట్‌ (5 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు), సామ్స్‌ (5 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు) తేలిపోయారు.

మరిన్ని వార్తలు