రెండు రోజుల పాటు(ఫిబ్రవరి 12, 13) ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం నిన్నటితో ముగిసింది. లీగ్లో పాల్గొనబోయే 10 జట్లు తమతమ పర్స్లలోని డబ్బులకు సరిపడా ఆటగాళ్లను కొనుగోలు చేసి ఐపీఎల్ 2022 మెగా ఫైట్కు ఇప్పటినుంచే కత్తులు నూరుతున్నాయి. ఈ సారి వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ మిగిలిన జట్లతో పోలిస్తే కాస్త భిన్నంగా ఆటగాళ్లను కొనుగోలు చేసింది.
తమ వద్ద ఉన్న 68 కోట్లతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం యువ క్రికెటర్ల కొనుగోలుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టంగా తెలిసింది. కేన్ విలియమ్సన్(14 కోట్లు), అబ్దుల్ సమద్(4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్(4 కోట్లు)లను రిటైన్ చేసుకున్న ఎస్ఆర్హెచ్.. మెగా వేలంలో 67.9 కోట్లు వెచ్చించి 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. 2022 ఐపీఎల్ ఫైట్లో తలపడబోయే ఎస్ఆర్హెచ్ పూర్తి జాబితా ఇదే..
రిటైన్డ్ ఆటగాళ్లు:
మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: