IPL 2022 Title Sponsor: ఇకపై వివో ఐపీఎల్‌ కాదు.. టాటా ఐపీఎల్‌

11 Jan, 2022 15:46 IST|Sakshi

Tata IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్‌కు సంబంధించి కీలక మార్పు చోటు చేసుకుంది. టైటిల్ స్పాన్సర్ షిప్‌ నుంచి చైనా మొబైల్ సంస్థ ‘వీవో’ తప్పుకుంది. 2018 నుంచి టైటిల్‌ స్పాన్సర్‌గా ఉన్న వీవో.. మరో రెండేళ్ల గడువు ఉండగానే నాటకీయ పరిమాణాల మధ్య వైదొలగడంతో దేశీయ వ్యాపార దిగ్గజం 'టాటా' టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించనుందని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ వెల్లడించింది. 

ఈ ఏడాది ఐపీఎల్‌తో పాటు 2023 సీజన్‌కు కూడా టాటానే టైటిల్‌ స్పాన్సర్‌ చేయనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ ప్రకటించారు. కాగా, భారత్‌-చైనాల మధ్య వివాదాల కారణంగా 2020 సీజన్‌లో వీవో టైటిల్‌ స్పాన్సర్ షిప్‌ నుంచి తప్పించబడిన సంగతి తెలిసిందే. అప్పుడు వీవో స్థానంలో ‘డ్రీమ్ 11’ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది.
చదవండి: ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కీలక సమావేశం.. ఖరారు కానున్న షెడ్యూల్‌!

మరిన్ని వార్తలు