ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా అద్బుత ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఏకైక టెస్టు మ్యాచ్ ఓడిన తర్వాత ఫుంజుకున్న టీమిండియా టి20 సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. టి20 సిరీస్ జోష్ను తొలి వన్డేలోనే చూపించింది. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ను 110 పరుగులకే కట్టడి చేసిన భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తాజాగా టీమిండియా గురువారం రెండో వన్డేకు సిద్ధమైన వేళ ఒక అభిమాని షేర్ చేసిన వీడియో వైరల్గా మారింది.
తోటి క్రికెటర్పై జంప్ చేయబోయి చేతులు కాల్చుకున్న ఇషాన్ కిషన్ కిందపడి దెబ్బలు తగిలించుకున్నాడు. ఇదంతా ఇంగ్లండ్తో టి20 సిరీస్ సందర్భంగా మూడో టి20 మ్యాచ్లో జరిగింది. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ఇషాన్ కిషన్, ఉమ్రాన్ మాలిక్, రుతురాజ్ గైక్వాడ్, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయిలు ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటున్నారు. అ సమయంలో ఇషాన్ రవి బిష్ణోయి పైకి ఎక్కే ప్రయత్నంలో పట్టతప్పాడు.
దీంతో బిష్ణోయి పైనుంచి జారిన ఇషాన్ నేరుగా గ్రౌండ్పై పడ్డాడు. ఈ చర్యతో ఆటగాళ్ల మధ్య నవ్వులు విరపూశాయి. అయితే ఇషాన్కు ఎలాంటి గాయాలు కాకపోవడం కాస్త ఊరటనిచ్చింది. ఇది చూసిన అభిమానులు ''అరె ఇషాన్ కిషన్ ఎంత పని జరిగింది... స్టంట్ చేద్దామనుకొని అడ్డంగా బుక్కయ్యాడు.. పాపం ఇషాన్ కిషన్ కామెడీ కాస్త సీరియస్ అయింది.'' అంటూ కామెంట్స్ చేశారు.
చదవండి: అరటిపండ్లకు 35 లక్షల బిల్లు?.. ఆటగాళ్లకు చంపుతామంటూ బెదిరింపులు