రష్మిక జోడీ ఓటమి.. అంకిత జోడీ క్వార్టర్స్‌కు 

8 Mar, 2023 08:31 IST|Sakshi

బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నీ డబుల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ క్రీడాకారిణులు భమిడిపాటి శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లిలకు నిరాశ ఎదురైంది.

మంగళవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో రష్మిక–వైదేహి (భారత్‌) ద్వయం 6–7 (5/7), 7–5, 5–10తో హెసీ అమండైన్‌ (ఫ్రాన్స్‌)–దాలియా జకుపోవిచ్‌ (స్లొవేనియా) జోడీ చేతిలో... సహజ–సోహా సాదిక్‌ (భారత్‌) ద్వయం 4–6, 6–7 (3/7)తో ఎలీనా టియోడోరా (రొమేనియా)–డయానా మర్సిన్‌కెవికా (లాత్వియా) జోడీ చేతిలో ఓడిపోయాయి.

రెండో సీడ్‌ అంకిత రైనా–రుతుజా భోస్లే (భారత్‌) ద్వయం 5–7, 6–3, 10–6తో షర్మదా బాలు (భారత్‌)–సారా రెబెకా (జర్మనీ) జోడీని ఓడించి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది.     

మరిన్ని వార్తలు