WTC Final 2023: ప్రాక్టీస్‌కు సొంత కారులో వచ్చిన పుజారా.. ఆశ్చర్యపోయిన జడేజా!

3 Jun, 2023 12:58 IST|Sakshi

జూన్‌ 7నుంచి లండన్‌ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌- ఆస్ట్రేలియా జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా ఫైనల్‌ కోసం రోహిత్‌ నేతృత్వంలోని భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌కు ముందు భారత స్టార్‌ క్రికెటర్‌లు పుజారా, రవీంద్ర జడేజా మధ్య  ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. 

కాగా పుజారా ఇంగ్లండ్‌ కౌంటీల్లో సస్సెక్స్ తరపున ఆడుతున్న విషయం విధితమే. ఈ క్రమంలో పుజారా శుక్రవారం భారత జట్టుతో చేరాడు. అయితే పుజారా మాత్రం ప్రాక్టీస్‌ చేసే స్టేడియానికి జట్టు ప్రయాణించే బస్సులో కాకుండా.. తన సొంత కారులో చేరుకున్నాడు. అప్పటికే స్టేడియంకు చేరుకుని ప్రాక్టీస్‌ చేస్తున్న రవీంద్ర జడేజా.. కారులో ఒక్కసారిగా పుజారా చూసి ఆశ్చర్యపోయాడు.

అతడి దగ్గరికి వెళ్లి నిజంగానే పుజారా భాయ్‌ వచ్చాడా? అని గట్టిగా నవ్వుతూ అన్నాడు. ఇక పుజారా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది కౌంటీ ఛాంపియన్‌ షిప్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన పుజారా.. 545 పరుగులు సాధించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ విజేతగా టీమిండియా నిలవాలంటే పుజారా పాత్ర చాలా కీలకం.
చదవండి: WTC Final 2023: 50 ఏళ్లలో రెండు సార్లు మాత్రమే.. ఆసీసీను భయపెడుతున్న చెత్త రికార్డు

మరిన్ని వార్తలు