IND vs SA: టాస్‌ కాయిన్‌ ఇవ్వడం మర్చిపోయిన శ్రీనాథ్‌.. వీడియో వైరల్‌

9 Oct, 2022 16:03 IST|Sakshi

టీమిండియా-దక్షిణాఫ్రికా రెండో వన్డే సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. టాస్‌ సమయంలో మ్యాచ్‌ రిఫరీ జవగల్ శ్రీనాథ్‌తో పాటు మ్యాచ్ ప్రెజెంటర్ సంజయ్ మంజ్రేకర్ ఇరు జట్ల కెప్టెన్‌లు మైదానం మధ్యలోకి  వచ్చారు. ఈ క్రమంలో స్పిన్ చేయడానికి కాయిన్‌ ఎవరికి వచ్చిందిని మంజ్రేకర్ ఇరు జట్ల కెప్టెన్‌ను అడిగాడు.

ఈ క్రమంలో ధావన్‌, కేశవ్ మహారాజ్ ఇద్దరూ ఒకరినొకరు అయోమయంగా చూసుకున్నారు. ఎందుకుంటే కాయిన్‌ వారిద్దరి ఎవరు దగ్గర లేదు. మ్యాచ్‌ రిఫరీ జవగల్ శ్రీనాథ్‌ కాయిన్‌ కెప్టెన్లకు ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు.

ఈ క్రమంలో ధావన్‌ నవ్వుతూ శ్రీనాథ్‌కు కాయిన్‌ ఇవ్వమని అడిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌ షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


చదవండి: Tri Series NZ VS BAN: రాణించిన కాన్వే.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్‌

మరిన్ని వార్తలు