జులన్‌... ఐదో ర్యాంక్‌తో ముగింపు

28 Sep, 2022 05:01 IST|Sakshi

గతవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మహిళల జట్టు పేస్‌ బౌలర్‌ జులన్‌ గోస్వామి తన కెరీర్‌ను ఐదో ర్యాంక్‌తో ముగించింది. మంగళవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో 39 ఏళ్ల జులన్‌ బౌలర్ల విభాగంలో 698 పాయింట్లతో తన ఐదో ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఐదో ర్యాంక్‌లో...   స్మృతి మంధాన ఆరో ర్యాంక్‌లో నిలిచారు.

మరిన్ని వార్తలు