Jyothi Yarraji: 20 ఏళ్ల జాతీయ రికార్డు బద్దలు కొట్టిన ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌

11 May, 2022 07:45 IST|Sakshi

న్యూఢిల్లీ: సైప్రస్‌ అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ మీట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ జ్యోతి యెర్రాజీ స్వర్ణ పతకం సాధించింది. మంగళవారం జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్లో విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 13.23 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 13.38 సెకన్లతో అనురాధా బిస్వాల్‌ (ఒడిశా) పేరిట 20 ఏళ్లుగా ఉన్న జాతీయ రికార్డును జ్యోతి బద్దలు కొట్టింది. 

మరిన్ని వార్తలు