కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర కుర్రాడికి స్వర్ణం

13 Sep, 2022 09:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కామన్వెల్త్‌ కరాటే చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్‌ కుర్రాడు ఎ.కార్తీక్‌ రెడ్డి స్వర్ణ పతకంతో మెరిశాడు. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ పోటీల్లో కార్తీక్‌ రెడ్డి క్యాడెట్‌ బాలుర 70 కేజీల కుమిటే విభాగంలో విజేతగా నిలిచాడు. జారాలాంపౌస్‌ (సైప్రస్‌) రజతం, హారిసన్‌ లుకాస్‌ (స్కాట్లాండ్‌), జేకబ్‌ కట్లర్‌ (ఇంగ్లండ్‌) కాంస్య పతకాలు గెలిచారు.

మరిన్ని వార్తలు