గాయం నుంచి కోలుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తిరిగి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. గాయం కారణంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించాల్సిన రాహుల్ ఆఖరి నిమిషంలో దూరమైన విషయం తెలిసిందే. అనంతరం అతడు గత నెలలో స్పోర్ట్స్ హెర్నియాకు జర్మనీలో సర్జరీ చేయించుకున్నాడు. కాగా త్వరలో వెస్టిండీస్తో జరగనున్న టీ20 సిరీస్తో భారత జట్టులోకి రాహుల్ పునరాగమనం చేయనున్నాడు. విండీస్తో వన్డే సిరీస్కు కాకుండా టీ20 సిరీస్కు రాహుల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే అతడు తన ఫిట్నెస్ నిరూపించుకుంటూనే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.
ఈ క్రమంలో రాహుల్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చెమటోడ్చుతున్నాడు. సన్నాహాల్లో భాగంగా భారత మహిళా ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి బౌలింగ్లో రాహుల్ ప్రాక్టీస్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా గత కొన్ని నెలలగా గాయం కారణంగా జట్టుకు దూరమైన ఝులన్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. జూలన్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ మహిళల వన్డే వరల్డ్కప్లో బంగ్లాదేశ్పై ఆడింది.
చదవండి: Lendl Simmons : అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన వెస్టిండీస్ ఓపెనర్..!
K L Rahul is batting and Jhulan Goswami is bowling.
He is fully fit for West Indies tour 💙🔥 #MenInBlue
📍NCA, Bangalore#KlRahul #IndvsWI #INDvsEND
— 𝘛𝘶𝘴𝘩𝘢𝘳 ⚡ (@TUSHARBAGGA1M) July 18, 2022