విజేత శశికిరణ్‌

18 Apr, 2022 06:19 IST|Sakshi

చెన్నై: ఫాగర్నెస్‌ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ కృష్ణన్‌ శశికిరణ్‌ విజేతగా నిలిచాడు. నార్వేలో ముగిసిన ఈ టోర్నీలో శశికిరణ్‌ నిర్ణీత 9 రౌండ్ల తర్వాత 7 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ ఆర్యన్‌ చోప్రా కూడా 7 పాయింట్లు సాధించినా మెరుగైన టైబ్రేక్‌ స్కోరుతో శశికిరణ్‌కు టైటిల్‌ దక్కింది. ఆర్యన్‌ చోప్రాకు రెండో ర్యాంక్‌ లభించింది. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఎరిగైసి అర్జున్‌ 6.5 పాయింట్లతో 5వ ర్యాంక్‌లో నిలిచాడు.

మరిన్ని వార్తలు