Maharaja T20 Trophy: మహారాజా టీ20 లీగ్‌లో ఆడనున్న కర్ణాటక స్టార్‌ ఆటగాళ్లు..!

16 Jul, 2022 20:31 IST|Sakshi
PC: BCCI/IPL

కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ శనివారం కీలక ప్రకటన చేసింది. ఆరు జట్లతో కూడిన మహారాజా టీ20 లీగ్‌ను ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ టోర్నమెంట్ ఆగస్ట్ 7 ప్రారంభమై ఆగస్ట్ 26న ముగియనుంది. ఈ టోర్నీలో దేవదత్ పడిక్కల్, మయాంక్ అగర్వాల్, మనీష్ పాండే, శ్రేయాస్ గోపాల్, కె గౌతమ్, జగదీశ సుచిత్, కరుణ్ నాయర్ అభిమన్యు మిథున్ వంటి ఆ రాష్ట్ర స్టార్‌ ఆటగాళ్లు భాగం కానున్నారు.

ఇక బెంగళూరు, మైసూర్, హుబ్లీ, శివమొగ్గ, రాయచూర్, మంగళూరు జట్లుగా ఉన్నాయి. కాగా కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్  మాజీ అధ్యక్షుడు, మైసూర్ మహారాజు దివంగత శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. మహారాజా టీ20 ట్రోఫీలోని 18 మ్యాచ్‌లు మైసూర్‌లోని శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ గ్రౌండ్‌లో జరగనుండగా.. ఫైనల్‌తో సహా మరో 16 మ్యాచ్‌లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్నాయి.
చదవండిRobert Lewandowski: తొమ్మిది నిమిషాల్లో 5 గోల్స్‌.. ఫుట్‌బాల్‌లో కొత్త మొనగాడు

మరిన్ని వార్తలు