SL Vs BAN: ఆటగాళ్ల మాటల యుద్దం.. కొట్టుకున్నంత పనిచేశారు

24 Oct, 2021 17:16 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌ 2021 సూపర్‌ 12 లో భాగంగా  బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో  శ్రీలంక ఫాస్ట్‌ బౌలర్‌ లహీరు కుమార నోరుజారాడు. బంగ్లాదేశ్‌  ఇన్నింగ్స్‌ 6వ ఓవర్ బౌలింగ్ చేసిన లహీరు కుమార.. ఐదో బంతికి లిటన్‌దాస్‌ను పెవిలియన్‌కు పంపాడు. అయితే ఈ క్రమంలో లిటన్‌ దాస్‌ వైపు చూస్తూ  లహీరు కుమార మాటలు తూటాలు పేల్చాడు. ఈ క్రమంలో లిటన్‌ దాస్‌ కూడా తానేం తక్కువ తినలేదన్నట్లుగా అతనితో వాదనకు దిగాడు.

దీంతో ఇద్దరు క్రికెటర్ల మధ్య వాగ్వాదం జరగడంతో.. ఫీల్డ్ అంపైర్లు, సహచర ఆటగాళ్లు కలగజేసుకుని సర్దిచెపే ప్రయత్నం చేశారు. అయితే అంతకుముందు కూడా బంగ్లాదేశ్‌  ఇన్నింగ్స్‌ 4 వ ఓవర్ బౌలింగ్ చేసిన లహీరు కుమార.. అఖరి బంతిని  మహ్మద్‌ నయీమ్‌ ఢిపిన్స్‌ ఆడాడు. కానీ.. ఆ బంతిని అందుకున్న కుమార.. రనౌట్ కోసం వేగంగా నయీమ్‌పైకి విసిరాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ నీర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.

చదవండి: IND Vs PAK: అందుకే జట్టులో మాలిక్‌కు చోటు.. అసలు కారణం చెప్పిన పాక్‌ కెప్టెన్‌

మరిన్ని వార్తలు