లాంకషైర్‌ కౌంటీ జట్టు తరఫున శ్రేయస్‌ అయ్యర్‌

23 Mar, 2021 05:59 IST|Sakshi

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో భారత బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అడుగు పెడుతున్నాడు. ఇంగ్లండ్‌ దేశవాళీ వన్డే టోర్నీ ‘రాయల్‌ లండన్‌ కప్‌’లో అతను లాంకషైర్‌ జట్టు తరఫున బరిలోకి దిగుతాడు. జూలై 15న అయ్యర్‌ జట్టుతో చేరతాడు. ఈ వన్డే టోర్నీలో భాగంగా నెల రోజుల పాటు జరిగే గ్రూప్‌ దశ మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండే అవకాశం ఉంది. సాధారణంగా కౌంటీల్లో ఎంతో గుర్తింపు ఉన్న నాలుగు రోజుల ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల కోసం కాకుండా అయ్యర్‌ ప్రత్యేకంగా వన్డేల కోసం మాత్రమే లాంకషైర్‌తో జత కట్టాడు. గతంలో భారత్‌ నుంచి ఫరూఖ్‌ ఇంజినీర్,  లక్ష్మణ్,  గంగూలీ ఈ కౌంటీ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించారు.   

మరిన్ని వార్తలు