T20 World Cup 2022: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. కరోనా నుంచి కోలుకున్న షమీ

29 Sep, 2022 07:16 IST|Sakshi
PC: INDIA TV

న్యూఢిల్లీ: భారత పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ కరోనా నుంచి కోలుకున్నాడు. బుధవారం నిర్వహించిన పరీక్షలో షమీకి నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది.

ఈనెల 17న కోవిడ్‌–19 బారిన పడ్డ షమీ ముందుగా ఆస్ట్రేలియాతో... ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లకు దూరమయ్యాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే ప్రపంచకప్‌ టి20 టోర్నీ కోసం షమీని స్టాండ్‌బైగా ఎంపిక చేశారు.
చదవండి: T20 World Cup 2022: షమీకి పెరుగుతున్న మద్దతు.. అక్టోబర్‌ 9న డెడ్‌లైన్‌!

మరిన్ని వార్తలు