Lionel Messi: ధోని కూతురుకు మెస్సీ అరుదైన కానుక

28 Dec, 2022 16:16 IST|Sakshi

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీకి విశ్వవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇటీవలే ఫిఫా వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత ఆ అభిమానం మరింత రెట్టింపైంది. ఖతర్‌ వేదికగా జరిగిన సాకర్‌ సమరంలో ఎలాగైనా మెస్సీ కప్‌ గెలవాలని అర్జెంటీనా అభిమానులే కాదు విశ్వవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్‌ బలంగా కోరుకున్నారు. అందుకు తగ్గట్టే మెస్సీ తన కలను నెరవేర్చుకోవడమే గాక అర్జెంటీనాకు ముచ్చటగా మూడోసారి ఫిఫా టైటిల్‌ను అందించాడు. మరి అలాంటి మెస్సీని ఆరాధించని వాళ్లు ఎవరు ఉంటారు చెప్పండి.

తాజాగా ఆ జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని కూడా ఉన్నాడు.క్రికెట్ తో పాటు ఫుట్ బాల్ తనకెంతో ఇష్టమైన ఆట అంటూ ధోని గతంలోనూ చాలాసార్లు చెప్పాడు. క్రికెటర్‌ కాకపోయుంటే గోల్‌కీపర్‌ అయ్యేవాడినని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు ధోని. ఇక తండ్రిలాగే జీవాకు ఫుట్ బాల్ ఆటంటే చాలా ఇష్టం.

అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ ఆటను తండ్రితో కలిసి చూస్తుంటుంది. ఈ క్రమంలోనే మెస్సీపై అభిమానం పెంచుకుంది.  ఈ నేపథ్యంలోనే  మెస్సీ.. తన అభిమాని అయిన ధోని కూతురు జీవా ధోనికి గిఫ్ట్ పంపించాడు. తన జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి జీవాకు పంపించాడు. అభిమాన ఆటగాడి నుంచి అందిన కానుకను చూసుకుంటూ జీవా ధోని మురిసిపోయింది. ఆ జెర్సీ వేసుకుని తీసుకున్న ఫొటోను ఇన్ స్టాలో అప్ లోడ్ చేసింది. ఈ ఫొటోలో జెర్సీపై..'' పారా జివా(జీవా కోసం)'' అంటూ మెస్సీ చేసిన సంతకం కనిపిస్తోంది.

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni)

చదవండి: అందుకే అత్యుత్సాహం పనికి రాదంటారు..

మరిన్ని వార్తలు