SMAT 2022: కీలక ఇన్నింగ్స్‌ ఆడిన సర్ఫరాజ్‌ ఖాన్‌, గెలిపించిన కోటియన్‌.. తొలిసారి టైటిల్‌ నెగ్గిన ముంబై

5 Nov, 2022 21:54 IST|Sakshi

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2022 విజేతగా ముంబై జట్టు నిలిచింది. ఇవాళ (నవంబర్‌ 6) జరిగిన ఫైనల్లో ముంబై.. హిమాచల్‌ప్రదేశ్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించి తొలిసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ (31 బంతుల్లో 36 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడగా, తనుష్‌ కోటియన్‌ తొలుత బౌలింగ్‌లో (3/15, 5 బంతుల్లో 9 నాటౌట్‌; సిక్స్‌), ఆతర్వాత బ్యాటింగ్‌లో ఉత్కంఠ సమయంలో సిక్సర్‌ కొట్టి ముంబైని గెలిపించాడు. 

టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన ముంబై.. తనుష్‌ కోటియన్‌, మోహిత్‌ అవస్థి (3/15), అమన్‌ హకీం ఖాన్‌ (1/24), శివమ్‌ దూబే (1/16) బంతితో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఏకాంత్‌ సేన్‌ (37) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబై ఆరంభంలోనే తడబడినప్పటికీ.. యశస్వి జైస్వాల్‌ (27), శ్రేయస్‌ అయ్యర్‌ (34), సర్ఫరాజ్‌ ఖాన్‌ ఓ మోస్తరుగా రాణించి ముంబైని విజేతగా నిలిపారు. 12 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన సమయంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ 2 ఫోర్లు, సిక్సర్‌ బాది జట్టును గెలుపు ట్రాక్‌లో పెట్టాడు. ఆఖరి ఓవర్‌లో ముంబై గెలుపుకు 8 పరుగులు అవసరం కాగా.. తనుష్‌ కోటియన్‌.. రిషి ధవన్‌ వేసిన మూడో బంతికి సిక్పర్‌ బాది ముంబై చాన్నాళ్ల కలను సాకారం చేశాడు. 

మరిన్ని వార్తలు