Neeraj Chopra: డైమండ్‌ లీగ్‌ మీట్‌లో నీరజ్‌ చోప్రా

24 Aug, 2022 08:00 IST|Sakshi

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా గజ్జల్లో గాయం నుంచి కోలుకున్నాడు. ఈనెల 26న స్విట్జర్లాండ్‌లోని లుసాన్‌లో జరిగే డైమండ్‌ లీగ్‌ మీట్‌లో నీరజ్‌ బరిలోకి దిగనున్నాడు. ఈ మీట్‌లో అతను రాణిస్తే వచ్చే నెలలో 7, 8 తేదీల్లో స్విట్జర్లాండ్‌లోనే జరిగే డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాడు. గత నెలలో అమెరికాలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో నీరజ్‌ రజతం సాధించాడు. ఫైనల్‌ సందర్భంగా గాయపడటంతో నీరజ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి వైదొలిగాడు.  

మరిన్ని వార్తలు