పాకిస్తాన్-బంగ్లాదేశ్- న్యూజిలాండ్ ట్రై సిరీస్లో కివీస్ వరుసగా రెండో విజయం సాధించింది. క్రైస్ట్చర్చ్ వేదికగా మంగళవారం పాకిస్తాన్తో జరిగిన జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. దీంతో తొలి మ్యాచ్లో పాక్ చేతిలో ఓటమికి న్యూజిలాండ్ బదలు తీర్చుకున్నట్లైంది. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది.
పాక్ ఇన్నింగ్స్లో ఇఫ్తికర్ ఆహ్మద్ (27), ఆసీఫ్ ఆలీ(25) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో సౌథీ రెండు, శాంట్నర్, బ్రేస్వెల్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక 131 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 16.1 ఓవర్లలో ఛేదించింది. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్లు ఫిన్ అలెన్(62), కాన్వే(49 నాటౌట్) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ ఒక్క వికెట్ పడగొట్టాడు.
చదవండి: Aaron Finch: అంపైర్ను బూతులు తిట్టిన ఆరోన్ ఫించ్.. వీడియో వైరల్