ENG Vs NZ Test Series 2022: ఇంగ్లండ్‌తో టెస్టులకు కివీస్‌ జట్టును ప్రకటన.. కేన్‌ విలియమ్సన్‌ వచ్చేశాడు!

4 May, 2022 11:14 IST|Sakshi

న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్‌ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో 20 మంది సభ్యలతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు మంగళవారం ప్రకటించింది. కాగా గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరమైన కెప్టెన్‌ కేన్ విలియమ్సన్ తిరిగి జట్టులోకి వచ్చాడు.

నవంబర్ 2021లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను విలియమ్సన్ ఆడాడు. మరో వైపు దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపుతున్న  మైఖేల్ బ్రేస్‌వెల్‌, వికెట్ కీపర్ క్యామ్ ఫ్లెచర్, ఓపెనర్ హమీష్ రూథర్‌ఫోర్డ్, పేసర్లు జాకబ్ డఫీ,బ్లెయిర్ టిక్నర్‌కు న్యూజిలాండ్‌ జట్టులో చోటు దక్కింది. ఇక మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు జాన్‌2న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ప్రారంభం కానుంది.

న్యూజిలాండ్‌ జట్టు: కేన్‌ విలియమ్సన్ (కెప్టెన్‌), టామ్ బ్లండెల్ (వికెట్‌ కీపర్‌), ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, జాకబ్ డఫీ, కామెరాన్ ఫ్లెచర్, మాట్ హెన్రీ, కైల్ జామీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, అజాజ్‌, రచిన్‌ రవీంద్ర, హమీష్ రూథర్‌ఫోర్డ్, టిమ్ సౌతీ, బ్లెయిర్ టిక్నర్, నీల్ వాగ్నర్, విల్ యంగ్

చదవండి: IPL 2022: ఐపీఎల్‌లో ధావన్‌ అరుదైన ఫీట్‌.. కోహ్లి రికార్డు బద్దలు..!

మరిన్ని వార్తలు