నిఖత్‌ జరీన్‌కు ఘనస్వాగతం

2 Apr, 2023 10:17 IST|Sakshi

శంషాబాద్‌: ప్రపంచ మహిళా బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌ గెలుచుకున్న నిఖత్‌ జరీన్‌కు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. శనివారం ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న నిఖత్‌కు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ చాంపియన్‌న్‌షిప్‌ సాధించిన నిఖత్‌ యువతకు ఆదర్శమని ప్రశంసించారు.

అనంతరం ఓపెన్‌టాప్‌ జీప్‌లో ఆమెతో పాటు ప్రయాణించారు. ఈ సందర్భంగా క్రీడాభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. నిఖత్‌కు స్వాగతం పలికిన వారిలో క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌ ఆంజనేయగౌడ్, రాష్ట్ర బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్, మాజీ ఎంపీ వేణుగోపాలాచారి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఉన్నతాధికారులు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు